Semi Finals: ఛాంపియన్స్ ట్రోఫీ.. సెమీ ఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఎవరో? 1 y ago
ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ ఎలో ఇప్పటికే సెమీస్ బెర్తులు ఖరారు కాగా.. గ్రూప్ బిలో పోరు రసవత్తరంగా మారింది. గ్రూప్ ఎలో భారత్, న్యూజిలాండ్ వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి నాకౌట్కు అర్హత సాధించాయి. గ్రూప్ బిలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మూడేసి పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు ఇంకా ఒక్కో మ్యాచ్ ఆడాల్సిఉంది. మరోవైపు, ఇంగ్లండ్పై అఫ్గాన్ (2 పాయింట్లు) సంచలన విజయం సాధించి సెమీస్ రేసులోకి వచ్చింది. వరుసగా రెండో ఓటమితో ఇంగ్లండ్ నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. దీంతో గ్రూప్ బిలో ఏఏ జట్లు సెమీస్ కు చేరతాయి, సెమీ ఫైనల్లో భారత్ తో ఏ టీమ్ తలపడుతుంది అనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.